Wednesday, June 18, 2025

LATEST UPDATES
>> SBI Prelims results out 2023  >> Abdel Fattah al-Sisi (Egypt's President) is the Chief Guest of 74th Republic Day 2023  >> సర్దార్ సరోవర్ డ్యామ్  >> GENERAL KNOWLEDGE  >> అతి పెద్ద మంచినీటి సరస్సు -- బైకాల్ సరస్సు    

Monday, September 19, 2022

దేశంలో తీర రేఖ కలిగిన రాష్ట్రాలు వాటి వివరాలు

భారతదేశ తీరరేఖ పొడవు - 7516.7 కి.మీ.తీర రేఖ పరంగా భారతదేశ స్థానం(ప్రపంచంలో) - 18. భారతదేశంలో తీర రేఖ గల రాష్ట్రాలు - 9, కేంద్ర పాలిత ప్రాంతాలు-4. తీర రేఖ కలిగిన రాజకీయ విభాగాలు: 13


తీర రేఖ కలిగిన రాష్ట్రాలు:

పశ్చిమ తీరం

గుజరాత్‌(1214.7 కి.మీ.).

· గుజరాత్తీరాన్ని కతీయవార్తీరంఅని పిలుస్తారు. దేశంలో అతి పొడవైన తీర రేఖ కలిగిన రాష్ట్రం గుజరాత్‌.

మహారాష్ట్ర(652.6 కి.మీ.)

· మహారాష్ట్ర తీరాన్ని కొంకణ్తీరంఅని పిలుస్తారు

గోవా(101 కి.మీ.)

· గోవా తీరాన్ని కొంకణ్తీరంఅని పిలుస్తారు. అతి తక్కువ తీర రేఖ కలిగిన రాష్ట్రం గోవా.

కర్ణాటక(280 కి.మీ.)

· కర్ణాటక తీరాన్ని కెనరా తీరంఅని పిలుస్తారు

 కేరళ(569.7 కి.మీ.)

· కేరళ తీరాన్ని మలబార్తీరంఅని పిలుస్తారు

· 

తూర్పు తీరం

తమిళనాడు(906.9 కి.మీ.)

· తమిళనాడు తీరాన్ని కోరమాండల్తీరంఅని పిలుస్తారు

ఆంధ్రప్రదేశ్‌(974 కి.మీ.)

· ఆంధ్రా తీరాన్ని సర్కార్తీరంఅని పిలుస్తారు. దేశంలో రెండో అత్యధిక తీరరేఖ కలిగిన రాష్ట్రం. తూర్పు తీరంలో అత్యధిక తీర రేఖ కలిగిన రాష్ట్రం.

ఒడిసా(476.4 కి.మీ.)

· ఒడిసా తీరాన్ని ఉత్కళ తీరంఅని పిలుస్తారు

పశ్చిమ బెంగాల్‌(157.5 కి.మీ.)

· దీని తీరాన్ని వంగ తీరంఅని పిలుస్తారు.

· 

కేంద్రపాలిత ప్రాంతాలు:

1. అండమాన్నికోబార్‌ - 1962 కి.మీ.

2. లక్ష దీవులు - 132 కి.మీ.

3. పుదుచ్చేరి - 47.6 కి.మీ.

4. డయ్యూడామన్‌ - 42.5 కి.మీ.

· దేశంలో అత్యధిక తీర రేఖ కలిగిన రాష్ర్టాలు : 1. గుజరాత్‌, 2. ఆంధ్రప్రదేశ్

· దేశంలో అతి తక్కువ తీర రేఖ కలిగిన రాష్ట్రాలు: 1. గోవా, 2. పశ్చిమ బెంగాల్

· దేశంలో అతిపొడవైన తీరం: కథియావార్తీరం

· దేశంలో అతి తక్కువ పొడవు కలిగిన తీరం: వంగ తీరం

· దేశంలో అత్యధిక తీరరేఖ కలిగిన  కేంద్ర పాలిత ప్రాంతం: అండమాన్నికోబార్

· దేశంలో అతి తక్కువ తీర రేఖ కలిగిన కేంద్ర పాలిత ప్రాంతం: డామన్డయ్యూ

· ప్రపంచంలో అత్యధిక తీరరేఖ కలిగిన దేశం: కెనడా - 2, 02,080 కి.మీ.

· ప్రపంచంలో అత్యల్ప తీరరేఖ కలిగిన దేశం: మొనాకో - 4.1 కి.మీ.

· ప్రపంచంలో అత్యధిక తీరరేఖ కలిగిన నగరం: కోక్సస్బజార్‌(బంగ్లాదేశ్‌)

· దేశంలో అత్యధిక తీరరేఖ కలిగిన నగరం: చెన్నై

· ప్రపంచంలో అతిపొడవైన బీచ్‌: ప్రయ డో కాసినో(బ్రెజిల్‌)- 254. కి.మీ.

· దేశంలో అతి పొడవైన బీచ్‌: మెరీనా బీచ్‌ - 13 కి.మీ.

· దేశంలో అత్యధిక బీచ్లను కలిగిన రాష్ట్రం: మహారాష్ట్ర'

· 

బ్లూఫ్లాగ్బీచ్లు

ఈ సర్టిఫికెట్ని పొందాలంటే బీచ్పర్యావరణహితంగా ఉండటంతోపాటు పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి. ఎలాంటి రసాయనాలు బీచ్పరిసరాల్లో కలవకుండా చూడాలి. ఈ సర్టిఫికెట్ని డెన్మార్క్కి చెందిన ఫౌండేషన్ఆఫ్ఎన్విరాన్మెంటల్ఎడ్యుకేషన్‌(ఎ్ఫఈఈ) ఇస్తుంది. ప్రపంచవ్యాప్తంగా బ్లూఫ్లాగ్బీచ్లకు విశేషాదరణ ఉంటుంది. విదేశీ పర్యాటకులు ముందుగా బ్లూఫ్లాగ్బీచ్నే ఎంపిక చేసుకుంటారు. ఇప్పటివరకు 46 దేశాల్లో 4,500 బీచ్లు బ్లూఫ్లాగ్సర్టిఫికెట్ని పొందాయి. 2020 అక్టోబరు 11న మనదేశంలో 10 బీచ్లు బ్లూఫ్లాగ్సర్టిఫికెట్కు ఎంపికయ్యాయని ఎఫ్ఈఈ వెల్లడించింది. అవి..

1. రుషికొండ బీచ్‌(ఆంధ్రప్రదేశ్‌)

2. గోల్డెన్బీచ్‌(ఒడిషా)

3. రాధానగర్బీచ్‌(అండమాన్‌)

4. కోవెలం బీచ్‌(తమిళనాడు)

5. ఈడెన్బీచ్‌(పుదుచ్చేరి)

6. కప్పడ్బీచ్‌(కేరళ)

7. పదుబిద్రి బీచ్‌(కర్ణాటక)

8. కాసర్గోడ్బీచ్‌(కర్ణాటక)

9. ఘోగ్లా బీచ్‌(డయ్యూ)

10. శివరాజ్పూర్బీచ్‌(గుజరాత్‌)

· భారతదేశ ప్రాదేశిక జలాల పరిధి 12 నాటికల్మైళ్లు(ఒక నాటికల్మైలు = 1.852 కి.మీ.).

· ఈ పరిధిలోకి ప్రవేశించాలంటే ఏ విదేశీ నౌకకైనా భారత్అనుమతి తప్పనిసరి.

 

ప్రత్యేక ఆర్థిక మండలి

· వ్యాపారపరంగా భారత జలాల పరిధి 200 నాటికల్మైళ్లు(370 కి.మీ.)

· ఈ ప్రాంతంలో దొరికే వనరులు అన్నీ భారత్కే చెందుతాయి. ఉదా: బాంబే హై

· ఈ జలాల పరిధి మొత్తం విస్తీర్ణం పరంగా - 2.02 మిలియన్.కి.మీ.

· 

1. భారత్‌ - శ్రీలంక

· భారతదేశం, శ్రీలంక మధ్య ఆడమ్స్బ్రిడ్జ్‌/రామసేతు, పాంబాన్దీవి, పాక్జలసంధి, మన్నార్సింధు శాఖ ప్రాంతాలు ఉన్నాయి.  

ఆడమ్స్బ్రిడ్జ్‌:  తమిళనాడుకు దక్షిణాన పాంబాన్దీవిలోని ధనుష్కోటినుంచి శ్రీలంకలోని తలైమన్నార్‌’ ప్రాంతం వరకు విస్తరించి ఉంది. దీని పొడవు 48. కి.మీ.

పాంబాన్దీవి: ఇది భారత్‌, శ్రీలంకకు మధ్య గల శిలా ఉపరితలంగల దీవి

పాక్జలసంధి: ఆడమ్స్బ్రిడ్జ్కు ఉత్తరాన పాక్అఖాతం, పాక్జలసంధి ఉన్నాయి. ఈ పాక్జలసంధి భారత్లోని పాయింట్కోడిక్కిరామ్‌’ నుంచి శ్రీలంకలోని పీడ్మౌంట్‌’ వరకు ఉంటుంది.

మన్నార్సింధు శాఖ: ఆడమ్స్బ్రిడ్జ్కి దక్షిణాన మన్నార్సింధు శాఖ ఉంది. ఈ సింధు శాఖ భారత్లోని నాగర్కోయిల్‌(తమిళనాడు)’ నుంచి శ్రీలంకలోని మన్నార్‌’ వరకు విస్తరించి ఉంది.

· 1974లో జరిగిన ఒప్పందం ప్రకారం కచ్చతీవుదీవిని భారత్శ్రీలంకకు లీజుకు ఇచ్చింది.

· 1956లో శ్రీలంక  ‘సింహాలిస్ఓన్లీఅనే చట్టం చేయడంతో, దానికి వ్యతిరేకంగా శ్రీలంక తమిళులు ఉద్యమం ప్రారంభించారు.

· 1976లో ఎల్టీటీఈ(లిబరేషన్ఆఫ్తమిళ్టైగర్ఈలం) ఏర్పడింది.

· 1987లో ఐపీకేఎ్(ఇండియన్పీస్కీపింగ్ఫోర్స్‌) ఏర్పడిందిశ్రీలంకలో శాంతి స్థాపన కోసం భారతదేశం ఎల్టీటీఈకి వ్యతిరేకంగా దీనిని ఏర్పాటు చేసింది.

· 1991 మే 21న తమిళనాడులోని పెరంబూరులో ఎల్టీటీఈ ఆత్మాహుతి దళం రాజీవ్గాంధీని హత్య చేసింది.

· మే 21ని ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవంగా నిర్వహిస్తున్నారు.

· శ్రీలంకలోని తమిళులు ఉన్న ఉత్తర భాగాన్ని జాఫ్నాఅని పిలుస్తారు.

· ఎల్టీటీఈ 2019 మే 18న అంతమైంది

2. భారత్‌ - మాల్దీవులు: భారత్కు, మాల్దీవులకు మధ్య 8 డిగ్రీ చానల్ఉంది.

3. భారత్‌ - ఇండోనేషియా: భారత్లోని గ్రేట్నికోబార్దీవికి, ఇండోనేషియాలోని సుమత్రా దీవికి మధ్య గ్రేట్చానల్ఉంది.

4. భారత్‌ - థాయ్లాండ్‌: భారతదేశానికి, థాయ్లాండ్కు మధ్య అండమాన్సముద్రం ఉంది.

5. భారత్‌ - మయన్మార్‌: భారత్కు, మయన్మార్కు మధ్య కోకో చానల్ఉంది.

6. భారత్‌ - బంగ్లాదేశ్‌: భారత్కు, బంగ్లాదేశ్కు మధ్య గల వివాదాస్పద దీవి - న్యూమర్దీవి. ఇది 1970 ప్రాంతంలో ఏర్పడిన సైక్లోన్సమయంలో ఏర్పడింది. ఇది నివాసరహిత ప్రాంతం అయినా ఇక్కడ పెద్ద ఎత్తున చమురు నిక్షేపాలు లభించే అవకాశం ఉందని ప్రచారం జరగడంతో రెండు దేశాలు దీనిపై హక్కుల కోసం ప్రయత్నించాయి. ఈ వివాదంపై బంగ్లాదేశ్అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. 2014లో అంతర్జాతీయ న్యాయస్థానం న్యూమర్దీవిని ఇరుదేశాలకు పంచింది.  

 


No comments:

Post a Comment

@2020 All Rights Reserved. Designed by WWW.SMARTWAYTOSTUDY.COM !!!! Sitemap !!!! Seo Blogger Templates